![]() ![]() |
|
![]() Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
సహజీవనం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకి ఒక క్రిమినల్ కేసులో శిక్షవేసింది న్యాయస్థానం. పార్టీ వర్గాలు శివమెత్తారు. ఊళ్ళని అల్లకల్లోలం చేశారు. 2000 ఫిబ్రవరి 2 వ తేదీన ధర్మపురిలో కొందరు నాయక భక్తులు - కోయంబత్తూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం బస్సుకి నిప్పంటించారు. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు - 44 మంది ఉన్నారు. కాలుతున్న మంటల్లోంచి బయటపడలేక ముగ్గురమ్మాయిలు - కోకిలావని, గాయత్రి, హేమలత అక్కడికక్కడే కాలి బూడిదయిపోయారు. ఇందుకు కారణమయిన ముగ్గురు స్వామి భక్తులు నెడుం చెళియన్, రవీంద్రన్, మునియప్పన్ అరెస్టయారు. విచారణలు జరిగాక - సేలం కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ అన్ని కోర్టులూ వీరికి మరణ శిక్షను ఏకగ్రీవంగా అంగీకరించాయి. మొన్ననే సుప్రీం కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది - పదేళ్ళ తర్వాత. ఇది పూర్వ కథ.
చచ్చిపోయిన కోకిలావని
తండ్రి
వీరాస్వామి
మనక్కాళ్ జిల్లాలోని
మహనూర్
గ్రామంలో
బస్సు
నడుపుకుంటుంటాడు.
మెహనూర్
నుంచి
కాటు
పుత్తూర్
కి
బ్రాయిలర్
చికెన్
చేర్చడం
అతని
వృత్తి.
తన
కూతురు
కాలి
మసి
అయిపోయిన
రోజు వీరాస్వామి
ప్రతీ దినం తన కూతురు లాంటి పిల్లల్ని కాలేజీకి చేరుస్తూ - ఆ దుర్మార్గుల వల్ల కాకపోతే ఆ పిల్లలలో తన బిడ్డకూడా ఉండేదనుకుంటూ - సాలీనా 50 వేల నష్టంతో తన బిడ్డని గుండెల్లో బతికించుకున్న మానవతావాది వీరాస్వామి. పదిమంది పిల్లల్లో తన బిడ్డని చూసుకుంటూ గుండె పగిలే వేదనతో 'సహజీవనం' అద్భుతమైన ఉద్యమకారుడు వీరాస్వామి. ఈ ప్రపంచంలో భరించలేని దుఃఖానికి కొత్త ఔషధాన్ని కనిపెట్టిన గొప్ప వైద్యుడు వీరాస్వామి. నిశ్శబ్ధంగా ఒక గొప్ప సత్యాన్ని నిరూపిస్తున్న అతి నేలబారు మనిషి. *** మరో కథ. మొన్న కృష్ణాష్టమి నాడు దేశమంతటా ఉత్సవాలు జరిగాయి. ప్రతీ సంవత్సరం జరుగుతున్నాయి. ఒక మతం తన దేవుడికి అర్పించే నివాళి అది. ఆ లీలల్ని తలుచుకుని, మననం చేసుకుని, తమ పరిసరల్లో వాటిని పునఃప్రతిష్టించుకుని మురిసిపోయే తరుణం. దేవుడిని ఆకాశంలో కాక - తమలో, తమ ఇళ్ళలో, తమ పరిసరాల్లో, తమ బిడ్డల్లో, తమ నైమిత్తిక జీవితంలో, జీవనంలో చూసుకునే ఓ గొప్ప సంప్రదాయపు చిహ్నాలవి. వందలాది హిందూ పండగల్లో - ఒక ఉత్సవం.
ఇది ఇంత అద్భుతమైన సహజీవనం! ఒక మత ఛాందసులు తమ మతం వారినే మారణ హోమం చేస్తూంటే, ఆ మె బతుకుతున్న రాష్టంలోనే సిద్దాంతాల పేరిట కొందరు ఉన్మాదులు పోలీసుల ప్రాణాల్ని బలితీసుకుంటూంటే, మతాన్ని పదవులకీ, డబ్బుకీ, అధికారానికీ ఫణంగా పెట్టే ఈనాటి అవ్యవస్థలో - నాలుగేళ్ళ పసిబిడ్డకి ఓ ముస్లిం తల్లి తన పొరుగు మతంలో ఔన్నత్యాన్ని బోధిస్తోంది. తాను జీవించే వ్యవస్థలోని 'విశ్వాసం'తో సహజీవనం చేస్తోంది. వీరాస్వామి గుండె పగిలే దుఃఖంతో సహజీవనం చేస్తున్నాడు. ఈ తల్లి ఓ సమాజం గర్వపడే విశ్వాసంతో సహజీవనం చేస్తోంది. ఈ సమాజ వృక్షానికి ఛాందసం పేరిట ఆకులు ఎండిపోతున్నాయి. దుఃఖం పేరిట కొమ్మలు మాడిపోతున్నాయి. కుహనా సిద్దాంతాల పేరిట కాండం శిధిలమవుతోంది. కాని వెదికితే, గుర్తుపడితే, మిగుల్చుకోగలిగితే ఇంకా వేళ్ళల్లో 'పచ్చ' అలాగే ఉంది. మనక్కాళ్ లో వీరాస్వామి, పాట్నాలో శ్రీకృష్ణ ఖాన్ తల్లి - ఇంకా ఇంకా ఈ దేశం - మన నాయకమ్మణ్యుల, పార్టీల, దౌర్జన్యకారుల చేతుల్లో పూర్తిగా భ్రష్టు పట్టలేదని నిశ్శబ్ధంగా నిరూపిస్తున్నారు. *** ************ ************ ************* ************* |